ఇయ్యాల ఢిల్లీకి మధు యాష్కీ గౌడ్

ఇయ్యాల ఢిల్లీకి మధు యాష్కీ గౌడ్
  • సామాజిక న్యాయ సమ్మేళనం మీటింగ్​కు అటెండ్ 

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి ఆయన అటెండ్ కానున్నారు. ఈ మీటింగ్ కు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సచిన్ పైలెట్ కూడా అటెండ్ కానున్నారు. 

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్లీనరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎంపవర్మెంట్, జనగణన అంశాలపై ఈ సమ్మేళనంలో చర్చ జరగనుంది. బుధవారం ఉదయం జరిగే ప్లీనరీ సెషన్​కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు.