నా కూతురుపై వచ్చిన వార్తలు అవాస్తవం

నా కూతురుపై వచ్చిన వార్తలు అవాస్తవం

హైదరాబాద్: పుడింగ్ మింక్ పబ్ తో తన కుమార్తె తేజశ్వినికి సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి తెలిపారు. శనివారం రాత్రి బంజరాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్‌ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అందులోని పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ పబ్ రేణుకా చౌదరి కూతురు తేజశ్వినిదేనంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ... తన కుమార్తెపై వచ్చిన వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఈ విషయమై తన కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు ప్రచారం జరిగిందని, అది నిజం కాదన్నారు. తన కుమార్తె ‘పుడింగ్ మింక్’ పబ్‌ ఓనర్‌ కాదని పేర్కొన్నారు. పుడింగ్‌ మింక్‌ పబ్‌తో తన కూతురికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిన్న ఫుడింగ్ మింక్ పబ్‌ దగ్గర తేజశ్విని లేదని రేణుకాచౌదరి స్పష్టం చేశారు. దయచేసి తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగేలా అసత్య ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్