మన కాళ్లు మనమే కాల్చుకున్నం: నవాజ్ షరీఫ్

మన కాళ్లు మనమే కాల్చుకున్నం: నవాజ్ షరీఫ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి ఇండియా, అమెరికా ఏమాత్రం కారణం కాదని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ తాము కొని తెచ్చుకున్నదేనని కామెంట్ చేశారు. సైనిక జోక్యం, అంతర్గత కుమ్ములాటలే దేశాన్ని సర్వనాశనం పట్టించాయన్నారు. 

బుధవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈరోజు ఆర్థిక పరంగా పాకిస్తాన్ బ్రష్టుపట్టిందంటే అందుకు ఇండియా, అమెరికా, అఫ్గానిస్తాన్​ దేశాలు ఎంతమాత్రం కారణం కాదు. ముందుకు నడవకుండా మన దేశ పాదాలపై మనమే సురుకు పెట్టుకున్నం. 2018లో సైనిక నిర్ణయంతో ఎంపికైన ప్రభుత్వం కారణంగానే ఆర్థిక వ్యవస్థ ఊబిలో, ప్రజలు కష్టాల్లో పడ్డారు” అని షరీఫ్ అన్నారు.