ఫోన్లు కొట్టుకొస్తే రోజుకు రూ. వెయ్యి

ఫోన్లు కొట్టుకొస్తే రోజుకు రూ. వెయ్యి
  • నలుగురు అరెస్ట్.. పరారీలో ఏ1

మెహిదీపట్నం, వెలుగు: రద్దీ ప్రాంతాల్లో సెల్​ఫోన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్​కు చెందిన అనిల్ కుమార్ నోనియా, గౌరవ్ నోనియా, ఝార్ఖండ్​కు చెందిన పరన్ కుమార్, దేవ్ కుమార్‌‌ కలిసి నగరంలో వివిధ ప్రాంతాల్లో సెల్​ఫోన్లు కొట్టేసి పారిపోయేవారు. విశ్వాసనీయ సమాచారంతో మెహిదీపట్నం సీఐ ఎస్. మల్లేశ్, డీఐ రాంబాబు నేతృత్వంలో క్రైమ్ టీమ్ పోలీసులు వీరిని పట్టుకున్నారు.

దాదాపు రూ.6 లక్షల విలువైన 21 సెల్‌‌ఫోన్​లను రికవరీ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి సాగర్ కుమార్ నోనియా ప్రతిరోజు రూ.వెయ్యి  ఇచ్చి రద్దీ ప్రాంతాల్లో సెల్‌‌ఫోన్లు కొట్టేసి తీసుకురావాలని వీరికి హుకుం జారీ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.