
గుడ్లూరు: లారీ, కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్ దగ్గర శుక్రవారం ఉదయం జరిగింది. విశాఖ జిల్లా కసింకోట మండలం ఎలమంచిలి గ్రామానికి చెందిన ఎం.వెంకటరామకృష్ణ పరమహంస(60), అతడి భార్య సూర్యకాంతం(55), మరో బంధువు చంద్రమౌళి(55)తో పాటు డ్రైవర్ సంతోష్(40) గురువారం రాత్రి 11 గంటలకు కారులో విశాఖ నుంచి తిరుపతి బయల్దేరారు.
శుక్రవారం ఉదయం 10:30గంటలకు శాంతినగర్ దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు.