షవర్మ తిని నలుగురికి అస్వస్థత

షవర్మ తిని నలుగురికి అస్వస్థత
  •     హైదరాబాద్ లోని అల్వాల్ లో ఘటన

అల్వాల్, వెలుగు: షవర్మ తిని నలుగురు యువతీ యువకులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. బొల్లారానికి చెందిన నలుగురు యువతీ యువకులు ఆదివారం లోతుకుంటలోని గ్రిల్ హౌస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లారు. అక్కడ షవర్మ తిన్నారు. ఆ తర్వాత ఇండ్లకు వెళ్లగా, నలుగురూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు వాళ్లను ఆస్పత్రులకు తరలించారు.

బాధితుల్లో ఇద్దరు కొంపల్లిలోని హర్ష హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. కాగా, ఇదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో గతంలో షవర్మ తిని ఓ వ్యక్తి చనిపోయాడు. ఇంతకుముందు కూడా పలువురు ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రుల పాలైన ఘటనలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ఈ హోటల్ ను నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు నడిపిస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.