శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-లారీ ఢీ.. ఆరుగురి మృతి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-లారీ ఢీ.. ఆరుగురి మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారును ఢీకొట్టి బోల్తాపడడడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం సాయంత్రం కొద్దిసేపట్లో చీకటిపడే సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరో 15మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కారును ఢీకొని బోల్తా కొట్టిన లారీలో.. ప్రమాద సమయంలో లారీలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. మరో ఆరుగురు లారీ కింద ఇరుక్కుని కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. పోలీసులు, అత్యవసర వైద్యసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన దినసరి కూలీలని చెబుతున్నారు. శంషాబాద్ లోని ఉందానగర్ కూరగాయల మార్కెట్లో సరుకులు తీసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.