చిట్యాల, వెలుగు: తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు సెయింట్ మార్క్స్ పాఠశాలలో ఆదివారం ఐదో సౌత్ జోన్ షూటింగ్ బాల్ సెలక్షన్స్నిర్వహించారు. నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. సీనియర్స్విభాగంలో గంగపురం రాము(ఉరుమడ్ల), ఎలుగు చంద్రశేఖర్(చిట్యాల), జూనియర్స్విభాగంలో ఎస్కే.నాగూర్ వలీ (నార్కట్ పల్లి), సబ్ జూనియర్స్విభాగంలో గాదగోని నాగరాజు (చిట్యాల గ్రీన్ గ్రో పాఠశాల) ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
వీరు ఏపీలోని తిరుపతిలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులను తాండూర్ డీఎస్పీ నర్సింగ్యాదయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు మంగళంపల్లి శ్రీనివాసులు, కార్యదర్శి ఐలయ్య, సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాము, సెక్రటరీ రాములు అభినందించారు.
