నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి పట్టణ శివారులో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నార్కట్పల్లి దగ్గర లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. దీంతో వాహనాలను రోడ్డు పక్కకు ఆపి డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగివున్న లారీని మరో లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు స్పా్ట్లోనే చనిపోయారు.
మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను బస్ డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యగా గుర్తించారు.
మృతదేహాలను పోస్ట్మార్టం కోసం నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీఐ నాగరాజు, ఎస్సై విష్ణు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ఈ ఘటనపై నార్కట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
