జ్వరంతో బాధపడుతూ నాలుగేళ్ల చిన్నారి మృతి

జ్వరంతో బాధపడుతూ నాలుగేళ్ల చిన్నారి మృతి

జ్వరంతో బాధపడుతూ నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. కొమురం భీమ్ అసిఫాబాద్  జిల్లా  కౌటాల మండలంలో చోటుచేసుకున్న ఈ  విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని  తుమ్మిడి హెట్టి గ్రామంలో  ఆధ్య శ్రీ అనే చిన్నారి జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు.. ఓ ఆర్ఎంపి డాక్టర్ వద్ద చూపించారు. 

అయితే,  చిన్నారి చికిత్స పొందుతూ మరణించడంతో.. ఆర్ఎంపి డాక్టర్ చేసిన  వైద్యం వికటించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.