
- ఆన్లైన్ బుక్ చేసుకుని వెళ్తే స్లాట్స్ ఫుల్ అంటూ అబద్ధాలు
- రూ.10, 50 ఫీజుకు బదులు వెయ్యి, రూ.2 వేలు వసూలు
- జెర్సీ లు, ట్రాక్స్, షూస్ తమ దగ్గరే కొనాలని ఒత్తిడి
- అందుబాటులో లేని కోచ్లు
- ఉదయం, సాయంత్రం కలిపి 2 గంటల్లోనే కోచింగ్ ఖతం
- గాలికి వదిలేసిన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్పోర్ట్ప్ కాంప్లెక్సుల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుల్లో దోపిడీ చేస్తున్నారు. నిర్ణయించిన ఫీజులకంటే ఎక్కువగా తీసుకుంటూ తల్లిదండ్రుల జేబులను కొల్లగొడుతున్నారు. వెబ్ సైట్ లో బుక్ చేసుకొని వెళ్లినా స్లాట్స్ ఫుల్ అంటూ రెగ్యులర్కోచింగ్ ఇస్తామని రూ.వేలకు వేలు తీసుకుంటున్నారు. పేరెంట్స్అడిగిన టైంలో కోచింగ్ఇవ్వాలంటే అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్లి.. కోచ్ లు స్లాట్స్ఖాళీ లేవన్నా ప్రశ్నించి జాయిన్చేస్తే ఆ స్టూడెంట్లను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకుందామని కోచింగ్ ఇచ్చే ప్లేస్కు డైరెక్ట్ వెళ్తే ఖాళీలు లేవని ప్రైవేట్ కోచింగ్ఇస్తామని దండుకుంటున్నారు.
375 చోట్ల సమ్మర్ క్యాంపులు
బల్దియా ప్రతి ఏడాది ఎండాకాలంలో సమ్మర్క్యాంపులు నిర్వహిస్తోంది. వీటి కోసం సుమారు 357 ఇన్డోర్, ఔట్డోర్ స్టేడియాలను కేటాయించి 915 క్యాంపులను ఏర్పాటు చేసింది. వీటిలో షటిల్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్, రోలర్స్కేటింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ సహా సుమారు 43 క్రీడల్లో శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 71 మంది పార్ట్ టైమ్ కోచ్లు ఉండగా, వీరు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తున్నారు.
నెలకు రూ.11,300 జీతాన్ని బల్దియా చెల్లిస్తోంది. అయితే, సమ్మర్ క్యాంపులకు వచ్చే పిల్లల కోసం ఈ సంఖ్య సరిపోదు కాబట్టి ప్రత్యేకంగా 997 మంది హానరరీ కోచ్ లను జీహెచ్ఎంసీ నియమించింది. నెలరోజులు మాత్రమే వీరు కోచింగ్ ఇస్తారు. వీరికి జీతం ఇవ్వడం లేదు. కేవలం ఒక ట్రాక్, జత షూజ్ మాత్రమే ఇస్తోంది.
ఆన్లైన్లో బుక్ చేస్తే పట్టించుకుంటలేరు..
ఎవరైనా తమ పిల్లలకు కోచింగ్ఇప్పించాలనుకుంటే స్పోర్ట్స్ జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టరై బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటి ఫీజు మినిమం రూ. రూ.10, రూ.50 వరకు ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆ స్లిప్ తీసుకు వెళ్లి మెన్షన్చేసిన సెంటర్లో ఇస్తే జాయిన్ చేసుకుని కోచింగ్ఇవ్వాలి. అయితే, కొన్ని సెంటర్లలోనే ఇది అమలవుతోంది.
ఇందిరా పార్కు వద్ద జరుగుతోంది ఇది..
ఇందిరాపార్కులోని రోలర్ స్కేటింగ్ నేర్చుకోవడానికి దాదాపు 150 మంది వరకు వస్తున్నారు. సమ్మర్ క్యాంపు కాబట్టి నెలరోజుల కోసం రూ.50 మాత్రమే తీసుకోవాలి. అదే రెగ్యులర్ కోచింగ్కు అయితే నెలకి రూ.300 మాత్రమే..కానీ ఇందిరా పార్కు కోచింగ్ క్యాంప్వద్ద ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలని వచ్చేవారి నుంచి రూ.2 వేల నుంచి రూ.2500 వరకు తీసుకుంటున్నారు.
ఆన్లైన్ బుక్ చేసుకుని వస్తే స్లాట్స్ ఫుల్ అయిపోయాయని చెప్తున్నారు. అలాగే షూస్, యూనిఫామ్ కూడా తమ దగ్గరే తీసుకోవాలని కోచ్లు పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ స్కేటింగ్ షూస్ ను కూడా రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
డుమ్మాలు కొడుతున్న కోచ్లు
కోచ్లు ఏదైనా అవసరం ఏర్పడి రాకపోతే ఇన్చార్జీలకు సమాచారం ఇవ్వాలి. అయితే, చాలా చోట్ల కోచ్లు చెప్పక చేయక డుమ్మాలు కొడుతున్నారు. దీంతో పిల్లలు తమకు నచ్చింది చేసుకుని పోతున్నారు. అమీర్పేటలోని సెంటర్లో ఓ కోచ్మూడు, నాలుగు రోజులుగా రాకపోవడంతో కోచింగ్కు వచ్చే ఓ పదేండ్ల పిల్లాడే మిగతా పిల్లలకు నేర్పిస్తున్నాడు. కోచ్కు ఫోన్చేసినా లిఫ్ట్చేయడం లేదని తెలుస్తోంది. సాయంత్రం కొంతమంది ఆఫీసర్లు నేర్చుకోవడానికి వస్తుండడంతో వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే వస్తున్నట్టు తెలిసింది.
ఉదయమో గంట...సాయంత్రమో గంట
క్యాంపుల్లో మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోచింగ్ ఇస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. కానీ, ఎక్కడా ఈ టైమింగ్స్అమలు కావడం లేదు. ఉదయం ఆరున్నర దాటితే కానీ, కోచింగ్మొదలు కావడం లేదు. అది కూడా ఎనిమిది గంటల్లోపే కంప్లీట్ చేసి పంపిస్తున్నారు.
సాయంత్రం కూడా ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల శని, ఆదివారాల్లో కోచ్లు, సిబ్బంది రాక స్టూడెంట్స్ వచ్చి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో ఎవరూ రెగ్యులర్గా రావడానికి ఆసక్తి చూపడం లేదు.
క్యాంపుల్లో నో స్విమ్మింగ్....
సమ్మర్లో స్విమ్మింగ్ కు డిమాండ్ ఉన్నా బల్దియా మాత్రం కోచింగ్ ఇవ్వడం లేదు. స్విమ్మింగ్ కోసం రెగ్యులర్ ఫీజు రూ.500 తీసుకుంటోంది. ఇంత చెల్లిస్తున్నా సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. క్యాంపులు స్టార్టయిన వారానికే విజయననగర్ కాలనీలోని స్విమ్మింగ్ పూల్ మోటర్ పాడైంది. దీంతో రెండు రోజులు పూల్బంద్చేయాల్సి వచ్చింది. అమీర్ పేట్ లోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నీటి సౌకర్యం లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్ ఓపెన్చేయలేదు.
అమీర్పేటలోనూ దందా...
అమీర్ పేటలోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఇష్టారాజ్యం నడుస్తోంది. రెండు రోజుల కింద ఓ కుటుంబం రోలర్ స్కేటింగ్ కోసం స్లాట్బుక్చేసుకొని వెళ్తే ఫుల్ అయిపోయారని సమాధానం చెప్పారు. రెగ్యులర్ కోచింగ్ఇస్తామని, రూ.1000 అవుతాయని చెప్పారు. ప్రశ్నిస్తే రెండు రోజుల తర్వాత కన్ఫమ్ చేస్తామన్నారు. ఇక్కడే జిమ్నాస్టిక్స్నేర్చుకునేందుకు స్లాట్ బుక్ చేసుకుని వెళ్లిన పేరెంట్స్ కి వింత అనుభవం ఎదురైంది.
బుకింగ్ పేపర్ చూపించగా అప్పటికే 200 మంది పిల్లలు ఉన్నారని, జాయిన్ చేసుకోవడానికి నిరాకరించారు. రూమ్లో పది షీట్స్వేసి అందులో కేవలం ఐదుగురికి మాత్రమే కోచింగ్ ఇస్తుండడంతో, మిగతా 195 మంది ఎక్కడా అని ప్రశ్నించగా ‘ఈ రోజు రాలేదు ’ అని సమాధానమిచ్చారు. దాదాపు అన్ని కోచింగ్ క్యాంపుల్లో ఇలాగే జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.