
తాజ్ మహల్ లోపల ఉన్న షాజహాన్,ముంతాజ్ల సమాధిని ప్రజల సందర్శన కోసం ఉంచే సందర్భం మొత్తం ఏడాదికి ఒకే ఒక్కసారి వస్తుంది. సాధారణంగా ఈ సమాధి ఏడాది పొడవునా మూసి ఉంటుంది. అయితే.. ప్రజలు మూడు రోజుల పాటు ఉర్స్ సందర్భంగా ఉచితంగా తాజ్మహల్లోకి వెళ్లి చూడవచ్చని అధికారులు తెలిపారు.
ఈ నెల( ఫిబ్రవరి) 27వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు పర్యాటకులు ఉచితంగా తాజ్మహల్ని చూడవచ్చని అధికారులు చెప్పారు.ఫిబ్రవరి 27వ తేదీ, 28 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు పర్యాటకులు ఉచితంగా తాజ్మహల్ చూడవచ్చు. మార్చి 1 న ఉదయం నుండి సాయంత్రం వరకు తాజ్మహల్ని చూసేందుకు అనుమతి ఉంటుందన్నారు.
షాజహాన్,ముంతాజ్ అసలు సమాధి చూసేందుకు సందర్శకులకు ఏడాదిలో ఒకసారి మాత్రమే అనుమతి లభిస్తుంది.కాగా తాజ్మహల్ సందర్శనకు భారతీయులు 50రూపాయలు మ్యూజియం చూసేందుకు 200రూపాయలు చెల్లించాలి. విదేశీయులు 1100రూపాయలు సాధారణ రోజుల్లో చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ఏడాది మాత్రం ఫ్రీగా తాజ్ మహల్ ను సందర్శించే అవకాశం కల్పించారు అధికారులు.
పర్యాటకులందరూ కొవిడ్ రూల్స్ తప్పకుండా పాటించాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం..