ఆర్మూర్లో ఉచితంగా బియ్యం పంపిణీ

ఆర్మూర్లో ఉచితంగా బియ్యం పంపిణీ

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లోని రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘అవ్వకు బువ్వ’ కార్యక్రమంలో 54 మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఖాందేష్ మాట్లాడుతూ ‘అవ్వకు బువ్వ’ కార్యక్రమం ద్వారా వృద్ధుల ఆకలి తీర్చడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరిన్ని సేవా  కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 

కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షుడు జిందం నరహరి, విద్యా గోపికృష్ణ పట్వారి, కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు బేతు గంగాధర్, తులసి పట్వారి, మీర శ్రావణ్ సభ్యులు మక్కల సాయినాథ్, గోక శరత్, ఖొడే శ్రీనివాస్, విష్ణు, సాయి, కళ్యాణ్, రాజేశ్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు .