హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ రాసే విద్యార్థులు డ్రైవర్ లేదా కండక్టర్కు హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
