జనవరి 1 నుంచి ఇంటింటికీ  శ్రీరాముడి అక్షింతలు

జనవరి 1 నుంచి ఇంటింటికీ  శ్రీరాముడి అక్షింతలు

బషీర్ బాగ్, వెలుగు : జనవరి 22న అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి పల్లె, పట్టణంలో జన సంపర్క అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శనివారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో వారు మీడియాతో మాట్లాడారు. జనవరి 1 నుంచి15 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలు, రాములవారి చిత్రపటం, మందిరం నమూనా కరపత్రం, ప్రతి ఇంటికి అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్​ సభ్యులు పండరీనాథ్, జన సంపర్క అభియాన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్, రామ్ సింగ్, నరసింహమూర్తి,శశిధర్ తదితరులు పాల్గొన్నారు.