గతంలో కరెంట్ అడుక్కుంటే.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు ఇస్తున్నాం

గతంలో కరెంట్ అడుక్కుంటే.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు ఇస్తున్నాం
  • ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్

ఎల్కతుర్తి, వెలుగు :  కరెంట్​ అడుక్కునే స్థానం నుంచి ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు మనమే కరెంట్​ ఇచ్చే స్థాయికి వచ్చాం అని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ అన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి, సూరారంలో రూ.1.65 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు హస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్, జడ్పీ చైర్మన్ డాక్టర్​ సుదీర్ కుమార్ తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. సూరారంలో అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర పాలనకు అంబేద్కర్ విధానాలే స్ఫూర్తి అని, అందుకే హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు.

ALSO READ :చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి

తెలంగాణ వస్తే కరెంటు లేక తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్​కుమార్​ రెడ్డి అన్నారని, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో వైస్​ ఎంపీపీ తంగెడ నగేశ్​, ట్రైనీ ఐపీఎస్​ అంకిత్​, సర్పంచ్ కుర్ర సాంబమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.