ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్లను..సింగరేణి నిర్లక్ష్యం చేస్తోంది

ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్లను..సింగరేణి నిర్లక్ష్యం చేస్తోంది

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్​సూపర్​వైజర్లను యాజమాన్యం పట్టించుకోవడం లేదని సింగరేణి కాలరీస్​వర్కర్స్​ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ఆరోపించారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కొత్తగూడెం జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో మెడికల్​అన్​ఫిట్ అయిన మైనింగ్, టెక్నికల్ సిబ్బందికి సరైన గౌరవం దక్కడం లేదన్నారు.

హోదాకు తగ్గట్లు సర్ఫేస్​ఉద్యోగం కల్పించడం లేదన్నారు. మైనింగ్, టెక్నికల్​సిబ్బందిని క్రమశిక్షణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. అనంతరం జీఎంను కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. ధర్నాలో యూనియన్ నాయకులు వీరస్వామి, మల్లికార్జున్​రావు, కిస్టోఫర్, గట్టయ్య, మధు పాల్గొన్నారు.