రూల్స్ తప్పినవ్‌, మీ దేశానికే పో!

రూల్స్ తప్పినవ్‌, మీ దేశానికే పో!

కోల్ కతా: వెస్ట్ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న పోలండ్ కు చెందిన స్టూడెంట్ కమిల్ ని దేశం విడిచి వెళ్లాల్సిందిగా కోల్ కతాలోని ఫారినర్ రీజినల్ రిజిస్ట్రేష న్ ఆఫీస్ ఆదేశించింది. సీఏఏ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొనడం ద్వారా కమిల్ వీసా నిబంధనలు అతిక్రమించాడని పేర్కొంటూ ఉత్తర్వులు వచ్చాయని యూనివర్సిటీ అధికారులు ఆదివారం మీడియాకు వెల్లడించారు.

ఫిబ్రవరి 22న జరిగిన యాంటీ సీఏఏ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడంపై కోల్ కతాలోని తమ ఆఫీసుకు వచ్చి వివరణ ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిపారు. కోల్‌‌కతాలోని విశ్వభారతి యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న అప్సరా అనికా మీమ్ అనే బంగ్లాదేశ్ యువతి సీఏఏ నిరసనల్లో పాల్గొనడంతో దేశం విడిచిపోవాలని ఇదివరకే కేంద్రం ఆదేశాలిచ్చింది.