100% వద్దే వద్దు.. ఫుడ్​ ప్యాకెట్స్పై ఇలా లేబుల్​ వేయొద్దు.. ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ ఆదేశం

100% వద్దే వద్దు.. ఫుడ్​ ప్యాకెట్స్పై ఇలా లేబుల్​ వేయొద్దు.. ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ ఆదేశం

న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ప్యాకెట్ల లేబుల్స్​పై "100 శాతం" అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ) నిషేధించింది. ఇలాంటివి వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలను, ప్రమోషన్లను కస్టమర్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, 100 శాతం పదాన్ని ఉపయోగించకుండా ఉండాలని అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్‌‌‌‌బీఓలు) కోరింది.

ఇటువంటి పదాలకు ప్రస్తుత నిబంధనల ప్రకారం తగిన నిర్వచనం లేదని వివరణ ఇచ్చింది.  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం, "100శాతం" అనే పదం ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ చట్టం, 2006 లేదా దాని కింద రూపొందిన నియమాల్లో  లేనేలేదని తెలిపింది.  "100శాతం అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ఆ పదార్థం పూర్తి స్వచ్ఛమైనది అనే అర్థం వస్తుంది.  పోటీ కంపెనీల ఉత్పత్తులు తక్కువ నాణ్యతతో ఉన్నాయనే భావం కలుగుతుంది”అని తెలిపింది.