బైడెన్ ఎన్నికల ప్రచారం రూ.1300 కోట్లు

బైడెన్ ఎన్నికల ప్రచారం రూ.1300 కోట్లు
  • ఫండ్ రైసింగ్​లో సమకూరిన నిధులు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రచారానికి ఫండ్ రైసింగ్​లో ఇప్పటివరకు రూ.1300 కోట్ల నిధులు సమకూరాయి. గత నెలలోనే బైడెన్ కు రూ.439 కోట్ల నిధులు వచ్చాయని క్యాంపెయిన్  ఆఫీసర్లు తెలిపారు. గత నెలలో జరిగిన ఫండ్ రైసింగ్​లో మాజీ అధ్యక్షులు ఒబామా, క్లింటన్  కూడా పాల్గొన్నారని, వారి ద్వారా రూ.33 కోట్లు వచ్చాయని చెప్పారు.

ఈ నెల 28న న్యూయార్క్​లో బైడెన్  మద్దతుదారులు ఫండ్ రైసింగ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పోటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. రోజురోజుకూ తమ ప్రచారం వేగం పుంజుకుంటోందని ఓ రేడియో ఇంటర్వ్యూలో బైడెన్  చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన ఫండ్ రైసింగ్​లో ఇప్పటిదాకా తాము రూ.1300 కోట్లు సమీకరించామని తెలిపారు. డొనేషన్లలో 97% 200 డాలర్లలోపే ఉన్నాయని బైడెన్  పేర్కొన్నారు.