హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అందించే రూసా(రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) నిధులు ల్యాప్స్ కాకుండా సద్వినియోగం చేసుకునేందుకు సరైన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీల వైస్చాన్సలర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. రూసా నిధులకు ఎంపికైన జేఎన్టీయూ, ఉస్మానియా, పొట్టి శ్రీరాములు, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల వీసీలతో రాజ్ భవన్లో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు.
రూసా నిబంధనల ప్రకారం మ్యాచింగ్ గ్రాంట్ పొందేందుకు వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్విడుదల కాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూసా నిధులు ల్యాప్స్అయ్యే అవకాశం ఉందని సమాచారం అందిన నేపథ్యంలో గవర్నర్ ఈ మేరకు వీసీలకు ఆదేశాలు ఇచ్చారు.