
ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్మెన్కు నోటీసు జారీ చేసింది. జీ20 సమిట్ జరుగుతున్నప్పుడు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(ఐజీఐ)లో సాధారణ, షెడ్యూల్లో లేని విమానాల ల్యాండింగ్, టేకాఫ్కు షెడ్యూల్డ్ ఎయిర్లైన్ ఆపరేటర్లు అనుమతి ఇవ్వరు. జీ20 కోసం వేసిన స్పెషల్ ఫ్లైట్స్ మాత్రమే నడుస్తుంటాయి. జీ20 ప్రముఖుల ప్రత్యేక విమానాల షెడ్యూల్, వాటి అసోసియేట్ ఫ్లైట్స్ వివరాలను ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కి అధికారులు అందజేశారు. ఐఏఎఫ్, బీఎస్ఎఫ్, ఏవియేషన్ రీసెర్చ్ ఫ్లైట్స్ జీ20 సమిట్ కోసం ఉపయోగిస్తున్నారు.
ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లను ఎయిర్బోర్న్ లేదా ఇతర మిషన్ల (క్యాజువాలిటీ/మెడికల్ ఎమర్జెన్సీ) కోసం వాడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన విమానం/హెలికాప్టర్లు గవర్నర్ లేదా సీఎం కోసం ఉపయోగిస్తారు. అన్ షెడ్యూల్డ్ విమానాలు ఐజీఐ చుట్టూ 300 కి.మీ రేడియస్లో వచ్చేందుకు అనుమతి లేదు. రోహిణి హెలిపోర్ట్ మూసేశారు. ఏ విమానం రావాలన్నా.. హోం ఎఫైర్స్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సఫ్దార్జంగ్ ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేశారు. ఐఏఎఫ్ హెలికాప్టర్లు ఎమర్జెన్సీ, వీవీఐపీ విధుల కోసం ఉంచారు. బీఎస్ఎఫ్/ఐఏఎఫ్ హెలికాప్టర్లు ఎన్ఎస్జీ బ్యాకప్కు సపోర్ట్గా ఉంటాయి.