జీ 20 సమిట్కు భారీ భద్రత..నో ఫ్లై జోన్​లోకి ఢిల్లీ

జీ 20 సమిట్కు భారీ భద్రత..నో ఫ్లై జోన్​లోకి ఢిల్లీ

ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్ ఎయిర్‌‌మెన్​కు నోటీసు జారీ చేసింది. జీ20 సమిట్ జరుగుతున్నప్పుడు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు(ఐజీఐ)లో సాధారణ, షెడ్యూల్​లో లేని విమానాల ల్యాండింగ్, టేకాఫ్​కు షెడ్యూల్డ్ ఎయిర్​లైన్ ఆపరేటర్లు అనుమతి ఇవ్వరు. జీ20 కోసం వేసిన స్పెషల్ ఫ్లైట్స్ మాత్రమే నడుస్తుంటాయి. జీ20 ప్రముఖుల ప్రత్యేక విమానాల షెడ్యూల్, వాటి అసోసియేట్ ఫ్లైట్స్ వివరాలను ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్​(ఏటీసీ)కి అధికారులు అందజేశారు. ఐఏఎఫ్, బీఎస్ఎఫ్, ఏవియేషన్ రీసెర్చ్ ఫ్లైట్స్ జీ20 సమిట్ కోసం ఉపయోగిస్తున్నారు.

 ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లను ఎయిర్​బోర్న్ లేదా ఇతర మిషన్ల (క్యాజువాలిటీ/మెడికల్ ఎమర్జెన్సీ) కోసం వాడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన విమానం/హెలికాప్టర్లు గవర్నర్ లేదా సీఎం కోసం ఉపయోగిస్తారు. అన్ షెడ్యూల్డ్​ విమానాలు ఐజీఐ చుట్టూ 300 కి.మీ రేడియస్​లో వచ్చేందుకు అనుమతి లేదు. రోహిణి హెలిపోర్ట్ మూసేశారు. ఏ విమానం రావాలన్నా.. హోం ఎఫైర్స్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సఫ్దార్​జంగ్ ఎయిర్​పోర్ట్​ను క్లోజ్ చేశారు. ఐఏఎఫ్ హెలికాప్టర్లు ఎమర్జెన్సీ, వీవీఐపీ విధుల కోసం ఉంచారు. బీఎస్ఎఫ్/ఐఏఎఫ్ హెలికాప్టర్లు ఎన్​ఎస్​జీ బ్యాకప్​కు సపోర్ట్​గా ఉంటాయి.