
- వ్యతిరేకంగా 18న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
- బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్
ఖైరతాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని, దాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల18న ఇందిరాపార్కు ధర్నా చౌక్వద్ద మహాధర్నా చేపడుతున్నట్టు డాక్టర్బీఆర్అంబేద్కర్నేషనల్ ఎస్సీ,ఎస్టీ ఫెడరేషన్నేషనల్చీఫ్సెక్రటరీ జనరల్ ఎం.నర్సింగరావు, నేషనల్సెక్రటరీ జి.శంకర్తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్శుక్రవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించి, దేశాన్ని కాపోడుకోవడమే ముఖ్య ఉద్ధేశమన్నారు. ముఖ్యంగా ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్విధానాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. ఓబీసీ, బీసీ, మైనార్టీలకు పొలిటికల్రిజర్వేషన్కల్పించాలని, అట్రాసిటీ యాక్టును కట్టుదిట్టంగా అమలుచేయాలని, దాడికి పాల్పడిన వారికి ముందస్తు బెయిలు ఇవ్వద్దన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ శాఖ అధ్యక్షుడు టి.రాజలింగం, ఎస్ఎస్. తన్వీర్, పి.వీరాస్వామి, కల్పన పాల్గొన్నారు.