కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ

కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ

సింగరేణి కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 ఇంక్లైవ్ లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,INTUC జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకున్న వంశీకృష్ణ మాట్లాడుతూ..  కొత్తబావులను నెలకొల్పుతామన్నారు. కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానని తెలిపారు వంశీకృష్ణ. మెడికల్ అన్ ఫిట్ పేరుతో  కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ సర్కార్ దోచుకుందన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సింగరేణిని  బీజేపీ సర్కార్ ప్రవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు ఐఎన్టీయూసీ  జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్.  గడ్డం వంశీకి ఏఐయుటీసి, సీపీఐ కార్మిక సంఘాలు మద్దతు తెలిపారు.