గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన ఓడ్ల వీరేంద్ర బ్రహ్మచారికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వడ్ల వీరేంద్ర బ్రహ్మచారికి అమెరికాలోని బే ఏరియా బయోటెక్నాలజీ సంస్థ న్యూరిక్స్ థెరప్యూటిక్స్ లో వైస్ ప్రెసిడెంట్, ట్రాన్స్ లేషనల్ మెడిసిన్ అండ్ క్లినికల్ బయో మార్కర్ గా నియమితులయ్యారు.
మ్యారిక్స్ సంస్థ క్యాన్సర్, వాపు సంబంధిత వ్యాధులకు వినూత్న ఔషధాలు అభివృద్ధిపై దృష్టిసారిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ఎ పూర్తి చేసిన అనంతరం డాక్టర్ వీరేంద్ర 2000 సంవత్స రంలో అమెరికాకు వెళ్లారు. గతరెండు దశాబ్దాలుగా ఇండియానా యూనివర్సిటీ, ఫడ్యు యూనివర్సిటీ ఇండియానా పోలీస్ జెనెంటెక్ గిరియేడ్ సైన్సెస్ ప్రముఖ సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశాడు.
