- ఆస్పత్రి సెల్లార్లో ఉండగా నెలకొన్న భయాందోళన
- డ్రైనేజీ మురుగంతా వెళ్తుండగా భరించలేని వాసన
- స్టేఫీ కాదని ఇప్పటికే హెచ్చరించిన నిపుణులు
- ఏండ్ల తరబడిగా కొలిక్కిరాని కొత్త బిల్డింగ్
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలోని డైట్ క్యాంటిన్తో ప్రమాదం పొంచి ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన నెలకొని ఉంది. ఆస్పత్రి సెల్లార్లో డైట్ క్యాంటిన్ ఉండగా, గాలి, వెలుతురు చాలా తక్కువగా వస్తుంది. వంట గదులు, సామగ్రి స్టోర్ రూమ్లో బొద్దింకలు, ఎలుకల బెడద తీవ్రంగా ఉంది. వంట చేస్తున్నప్పుడు వచ్చే పొగతో సిబ్బందికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలోని డ్రైనేజీ మురుగంతా క్యాంటీన్లోకి వస్తుండగా భరించలేని కంపు కొడుతోంది. గ్యాస్ సిలిండర్లు 20 నుంచి 30 వరకు నిల్వ చేసి ఉంచుతుండగా, ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకైతే ఫైర్ యాక్సిడెంట్జరిగే చాన్స్ఎక్కువగా ఉంది. రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, వెంటనే గాంధీ ఆసుపత్రిలో ప్రతిపాదిత స్థలంలో సొంత భవనాన్ని నిర్మించి, సెల్లార్ లోని క్యాంటిన్ను వెంటనే తరలించాలని ఆస్పత్రి స్టాఫ్, పేషెంట్లు కోరుతున్నారు.
బిల్డింగ్కు సీఎస్ఆర్ నిధులు
ఇటీవల కొన్ని కంపెనీలు సీఎస్ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) కింద డైట్ క్యాంటిన్ బిల్డింగ్ నిర్మించడానికి ఆస్పత్రి అధికారులను సంప్రదించినట్టు తెలిసింది. ముఖ్యంగా మింట్కాంపౌండ్( కేంద్ర ప్రభుత్వ టంకశాల) అధికారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే సంస్థ సొంతంగా లేదా రెండు, మూడు కంపెనీలతో కలిసి నిధులు సమకూర్చుకుంటుందా అనేది తెలియదని ఆస్పత్రి నోడల్ అధికారి డా. ప్రభాకర్రెడ్డి తెలిపారు.
ప్రతిపాదనలకే పరిమితం
ఆస్పత్రి సెల్లార్లో డైట్క్యాంటీన్నిర్వహణ సేఫ్టీ కాదని తేల్చి నిపుణులు హెచ్చరిస్తూ నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యులనేది పెద్ద ప్రశ్న. గతంలో పలుమార్లు జరిగిన హాస్పిటల్డెవలప్మెంట్సొసైటీ (హెచ్డీఎస్) సమావేశాల్లో కొత్త డైట్క్యాంటీన్బిల్డింగ్ప్రస్తావన వచ్చినా ప్రతిపాదనలకే పరిమితమైంది. భవన నిర్మాణానికి రూ. కోటి 20 లక్షలు ఖర్చవుతయని టీఎస్ఎంఎస్ ఐడీసీ ( తెలంగాణ స్టేట్మెడికల్సర్వీసెస్ అండ్ఇన్ఫ్రాస్ట్రక్చర్డెవలప్మెంట్కార్పొరేషన్) అధికారులు అంచనాలు కూడా రూపొందించారు. క్యాంటిన్ భవన నిర్మాణానికి ఓపీ బిల్డింగ్వెనక ( ప్రస్తుతం నిర్మిస్తున్న ఎంసీహెచ్బిల్డింగ్ పక్కన ) ఖాళీ జాగా సిద్ధంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు తెలిపారు.