పద్మారావునగర్/ బషీర్ బాగ్, వెలుగు : కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ సోమవారం రాత్రి గాంధీ మెడికల్కాలేజీ ఆవరణలో జూనియర్డాక్టర్ల అసోసియేషన్ఆధ్వర్యంలో క్యాండిల్స్ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.
లేనిపక్షంలో దేశంలోని జూడాలంతా కలిసి ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఉస్మానియా మెడికల్కాలేజీ స్టూడెంట్లు సోమవారం రాత్రి క్యాండిల్స్ర్యాలీ నిర్వహించారు. కోల్కతా ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
