గరిడేపల్లి, మఠంపల్లి, సూర్యాపేట, మేళ్లచెరువు, వెలుగు : పోలీసులు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ నరసింహ సూచించారు. గరిడేపల్లి మండల పరిధిలో మూడో విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని, కౌంటింగ్పూర్తయ్యే వరకు సంబంధిత ప్రాంతాలను వదిలి వెళ్లొద్దని చెప్పారు. పోలింగ్సెంటర్కు 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజలు గుమిగూడి ఉండవద్దని సూచించారు. అనంతరం మఠంపల్లి, సూర్యాపేట, మేళ్లచెరువు మండలాల్లోని పలు గ్రామాల్లో ఎస్పీ పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, పోలీస్ అధికారులు ఉన్నారు.
