రూల్స్ ప్రకారం చైర్పర్సన్ ఎన్నిక : కలెక్టర్ హనుమంతరావు

రూల్స్ ప్రకారం చైర్పర్సన్ ఎన్నిక : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, రూల్స్​ ప్రకారం చైర్​ పర్సన్ల ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్​  హనుమంతరావు ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఎన్నికైన కౌన్సిలర్లతో ముందుగా ప్రమాణ స్వీకారం జరిపించాలని, ఆ తర్వాతే చైర్​ పర్సన్, వైస్​చైర్​పర్సన్​ ఎన్నిక జరపాలని సూచించారు.

ప్రమాణ స్వీకారం, చైర్​ పర్సన్ల ఎన్నిక కోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కొక్కరిని ఆథరైజ్​డ్​ ఆఫీసర్​గా నియమించారు. భువనగిరి మున్సిపాలిటీకి అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు, యాదగిరిగుట్టకు డీఆర్​డీవో నాగిరెడ్డి,  పోచంపల్లికి డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి, ఆలేరు, చౌటుప్పల్​ మున్సిపాలిటీలకు ఆర్డీవోలు కృష్ణారెడ్డి,శేఖర్​ రెడ్డిని నియమించారు. మీటింగ్​లో మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.