రియల్టర్ ఇంట్లో  రూ.20 లక్షల సొత్తు చోరీ.. గండిపేట బాబానగర్ లో ఘటన

రియల్టర్ ఇంట్లో  రూ.20 లక్షల సొత్తు చోరీ.. గండిపేట బాబానగర్ లో ఘటన

గండిపేట, వెలుగు: అత్తాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఓ ఇంట్లో దొంగలు రూ.20 లక్షల సొత్తు ఎత్తుకుపోయారు. నౌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబానగర్​లో ఉండే ఫిరోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారి. ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్​కు వెళ్లాడు. ఇదే అదునుగా వచ్చిన దొంగలు ఇంటి ముందున్న కెమెరాలు పక్కకు కదిలించారు.

ఇంటి తాళాలు పగలగొట్టి అల్మారాలోని రూ.8 లక్షల నగదు, 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఫిరోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూసే సరికి చోరీ జరిగిందని తెలిసింది. ఫిరోజ్​కదలికలను గుర్తించిన దొంగలు స్కెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారమే చోరీ చేసినట్టు తెలుస్తున్నది. బైకులపై వచ్చిన ఐదుగురు దొంగలు ఈ చోరీ చేసినట్లు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషల్​ టీమ్స్​ఏర్పాటు చేశారు.