బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గండ్రనళిని నియమించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి,నిజాయితీ, నిబద్ధత పనిచేస్తారని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కృషిచేస్తారని తెలిపారు
గతంలో కరీంనగర్, వేములవాడ నుంచి పోటీ చేసిన గండ్ర నళిని నిజామాబాద్ మాజీ ఎంపీ తెలంగాణ ఉద్యమకారుడైన నారాయణ రెడ్డి బిడ్డ. టీఆర్ఎస్ లో మహిళలకు అవమానాలు ఎదురవుతున్నాయంటూ ఆ పార్టీ నుంచి 2021 జూన్ లో బయటకు వచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డా కేసీఆర్ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు.