మెట్టుగూడలో పేలిన గ్యాస్ సిలిండర్

మెట్టుగూడలో పేలిన గ్యాస్ సిలిండర్

సికింద్రాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్టుగూడ డివిజన్ దూడబావి బస్తీలో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో  ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పేలుడు ధాటికి ఇంటి గోడ కూలిపోయింది. ఘటనాస్థలాన్ని  డిప్యూటీ స్పీకర్ పద్మారావు సందర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది వాటిని ఆర్పివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.