రాఖీ పండుగ గిఫ్ట్ గా దేశ మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన కేంద్రం.. డిసెంబర్ లో కీలకమైన రాష్ట్రాల ఎన్నికలు, దీపావళీ నాటికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందని మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. లీటర్ కు 3 నుంచి 5 రూపాయల తగ్గించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. దీనికి జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ నివేదకలు అవుననే అంటున్నాయి.
ALSO READ : సనాతన ధర్మం ఎయిడ్స్, కుష్టు వ్యాధి లాంటిది: దేనికైనా రెడీ అంటున్న రాజా
2023 ఆగస్టు 30 నాటికి330 మిలియన్ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం 14.2కేజీల ఎల్ పీజీ సిలిండర్ పై రూ. 200 తగ్గించడంలో ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం కలిగింది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఈ LPG ధర తగ్గింపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.