ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా గాయత్రి బాధ్యతల స్వీకరణ

ఎక్సైజ్  సూపరింటెండెంట్ గా గాయత్రి బాధ్యతల స్వీకరణ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్ గా డి.గాయత్రి గురువారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్  పి ఉదయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం కలెక్టరేట్​లోని తన ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించారు.

వికారాబాద్  అబ్కారీ అధికారిగా పని చేస్తున్న ఆమెను నాగర్​కర్నూల్​కు బదిలీ చేయగా, ఇక్కడ పని చేస్తున్న షేక్ ఫయాజుద్దీన్ మేడ్చల్ కు బదిలీ అయ్యారు. ఇదిలాఉంటే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాగర్ కర్నూల్  మున్సిపల్  కమిషనర్  నరేశ్​బాబు కలెక్టర్ ను కలిసి బొకేను అందజేశారు.