యూత్‌‌కు నచ్చే గీతా శంకరం : ముఖేష్

యూత్‌‌కు నచ్చే గీతా శంకరం : ముఖేష్

ముఖేష్‌‌ గౌడ, ప్రియాంక శర్మ జంటగా రుద్ర దర్శకత్వంలో కె. దేవానంద్‌‌ నిర్మిస్తున్న  చిత్రం ‘గీతా శంకరం’.  ప్రస్తుతం షూటింగ్‌‌ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌‌లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను దీపావళి సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖేష్​ మాట్లాడుతూ ‘సీరియల్స్‌‌లో ఎలాగైతే మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది. 

యూత్‌‌కు నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి’ అని అన్నాడు.  అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది ప్రియాంక. విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో జరిగే కథ అందర్ని ఆకట్టుకుంటుందన్నాడు దర్శకుడు రుద్ర. ఇదొక మంచి ప్రేమకథా చిత్రమని నిర్మాత దేవానంద్ చెప్పారు.