ఆర్టీసీలో యూనియన్లను అనుమతించండి : రాజిరెడ్డి

ఆర్టీసీలో యూనియన్లను అనుమతించండి :  రాజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలని ఎస్ డబ్ల్యూ యూ (స్టాఫ్ వర్కర్స్ యూనియన్ ) జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి కోరారు. బీఆర్ఎస్ హయాం నాటి వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలన్నారు. మంగళవారం సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ ను కలిసి ఆర్టీసీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

 కారుణ్య నియామకాలను, మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల పిల్లలను  కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ పద్ధతిలో నియమించాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన పక్రియ త్వరగా పూర్తి చేసి అపాయింట్ డేట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.