- రీఏజెంట్ల టెండర్లు పూర్తయ్యాయన్న సూపరింటెండెంట్ రాజారావు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టెస్టులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు. బుధవారం ఆయన గాంధీలో మీడియాతో మాట్లాడారు. సీక్వెన్సింగ్కు అవసరమయ్యే రీఏజెంట్స్(కెమికల్స్) సరఫరాకు టెండర్ల ప్రక్రియ పూర్తయింద న్నారు. అవి అందిన వెంటనే మైక్రో బయాలజీ ల్యాబ్ ఇన్చార్జ్ ప్రొఫెసర్ నాగమణి ఆధ్వర్యంలో కరోనా శాంపిళ్లను సీక్వెన్సింగ్ చేస్తారన్నారు. సీక్వెన్స్ చేసిన కరోనా శాంపిళ్ల నివేదికల అబ్జర్వేషన్ కోసం కొన్నాళ్ల పాటు పుణెలోని ఎన్ఐవీకి పంపుతా మని, పూర్తిస్థాయిలో అవగాహన వచ్చిన తర్వాతే రిపోర్టులను పబ్లిష్ చేస్తామని ఆయన చెప్పారు. ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు గాంధీ టీమ్ సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 9 బ్లాక్ ఫంగస్ వార్డులు, 18 కరోనా వార్డులున్నాయని చెప్పారు.