- బల్దియా కమిషనర్ రొనాల్డ్ రోస్
- హెడ్డాఫీసులో బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు : సిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పని చేద్దామని బల్దియా కమిషనర్ రొనాల్డ్ రోస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సాయంత్రం 5 గంటలకు జీహెచ్ఎంసీహెడ్ ఆఫీసులో హెచ్ ఓడీలు, జోనల్ కమిషనర్లు, డీసీలతో కమిషనర్ సమావేశమయ్యారు. బల్దియా పనులపై అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ప్రారంభించిన వార్డు ఆఫీస్ ల పనితీరును ఎప్పటికప్పుడు జోనల్, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఇంకా పూర్తికాని పనులను స్పీడ్ గా చేపట్టి త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
శానిటేషన్ పై సమీక్షిస్తూ సంబంధిత డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ప్రతి రోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. గతంలో తాను ఇక్కడ పని చేశానని అధికారులతో గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఈఎన్ సీ జియావుద్దీన్, అడిషనల్ కమిషనర్లు ప్రియాంక ఆలా, సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనడి, యాదగిరి రావు, జోనల్ కమిషనర్లు పంకజ, మమత, రవికిరణ్, శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పద్మజ తదితరులు పాల్గొన్నారు.