
పద్మారావునగర్, వెలుగు: రసూల్పుర ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో గురువారం ఆయన సికింద్రాబాద్ జోన్లోని పలు ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ను పరిశీలించారు. రైల్వే స్టేషన్ పునరుద్ధరణ నేపథ్యలో బస్ స్టాప్ను పాత గాంధీ హాస్పిటల్ ప్రాంతానికి తరలించాలని సూచించారు.