ఫ్లైఓవర్​ కు భూసేకరణ చెయ్యండి.. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు

ఫ్లైఓవర్​ కు భూసేకరణ చెయ్యండి.. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు

పద్మారావునగర్, వెలుగు: రసూల్​పుర ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో గురువారం ఆయన సికింద్రాబాద్ జోన్​లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. 

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న  బస్ స్టాప్​ను పరిశీలించారు. రైల్వే స్టేషన్​ పునరుద్ధరణ నేపథ్యలో బస్ స్టాప్​ను పాత గాంధీ హాస్పిటల్​ ప్రాంతానికి తరలించాలని సూచించారు.