
సర్కారేమో దుబారా ఖర్చులు చేస్తున్నది: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ విభాగాలకు నిధుల కొరత కారణంగా గ్రేటర్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, స్ట్రీట్లైట్లు కాలిపోతే కొత్తవి కొనలేని దుస్థితిలో బల్దియా ఉన్నదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సోమవారం అడ్డగుట్ట డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బస్తీ వాసుల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. అడ్డగుట్టలోని జవహర్నగర్ బస్తీలో తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్ల సమస్యలపై చర్చించి, వెంటనే పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిధుల లేమి కారణంగా ప్రతి డివిజన్పరిధిలో కేవలం 40 వీధి లైట్లే ఇవ్వడమంటే ఇది ఎంత దారుణ స్థితి అన్నది సృష్టమవుతుందన్నారు.
దుబారా ఖర్చులు చేయడానికి నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు మాత్రం చేతులెత్తేస్తుందన్నారు. హైదరాబాద్మెట్రోవాటర్మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి తాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.