
బీజేపీఎల్పీగా పార్టీ తనను గుర్తించట్లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తాను ఎదగడం పార్టీలో కొందరికి ఇష్టం లేదన్నారు. తన ఓటమికి పార్టీలో కొందరు సీనియర్లు పనిచేస్తే కార్యకర్తలు తన గెలుపు కోసం కృషి చేశారన్నారు. లక్ష్మణ్ ఓడిపోవడానికి కారణం అధ్యక్ష పదవేనన్నారు. అధ్యక్షుడిగా బిజిగా ఉండడంతో నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు తనకే సమాచారం ఇవ్వడం లేదన్నారు. దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నపుడు ప్రోటోకాల్ పాటించేవారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి డీకే అరుణ, అర్వింద్, బండి సంజయ్ అర్హులేనన్నారు. అయితే తనకు అధ్యక్ష పదవిపై మోజులేదన్నారు రాజాసింగ్.తన రాజకీయ గురువు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు.