కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 8 నెలల నుంచి డ్యూటీ చేస్తున్న డాక్టర్లకు బ్రేక్ ఇచ్చే మార్గం చూడాలని సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే పనిగా డ్యూటీ చేయడం వల్ల మెంటల్ హెల్త్ దెబ్బ తినే అవకాశం ఉందని జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన బెంచ్ మంగళవారం చెప్పింది. కరోనా బాధితులకు అందిస్తున్న ట్రీట్మెంట్పై విచారణ జరుపుతున్న టైంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు.