క్యాన్సర్ చికిత్సకు గ్లెన్‌‌‌‌మార్క్ కొత్త మందు

క్యాన్సర్ చికిత్సకు గ్లెన్‌‌‌‌మార్క్ కొత్త మందు

న్యూఢిల్లీ:  డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అప్రూవల్ వచ్చాక క్యాన్సర్ చికిత్స డ్రగ్ జానుబ్రుటినిబ్‌‌‌‌ను భారత్‌‌‌‌లో లాంచ్ చేస్తామని గ్లెన్‌‌‌‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సోమవారం ప్రకటించింది.   ఈ డ్రగ్‌‌‌‌ను  బ్రుకిన్సా పేరుతో అమ్ముతారు.  భారత్‌‌‌‌లో బ్రూటన్స్ టైరోసిన్ కినాస్ (బిటీకే) ఇన్హిబిటర్‌‌‌‌‌‌‌‌గా అనుమతులు పొందిన మొదటి డ్రగ్ ఇదేనని,  ఇది 5 రకాల క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగిస్తారని గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌ పేర్కొంది.  

క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా/స్మాల్ లింఫోసైటిక్ లింఫోమా, వాల్డెన్‌‌‌‌స్ట్రోమ్ మాక్రోగ్లోబులినెమియా, మాంటిల్ సెల్ లింఫోమా, మార్జినల్ జోన్ లింఫోమా, ఫోలిక్యులర్ లింఫోమా చికిత్సలో ఈ మందును వాడతారని తెలిపింది.  “మేము బీజీన్ (ఇప్పుడు బీవన్‌‌‌‌ మెడిసిన్స్)తో కొనసాగుతున్న పార్టనర్‌‌‌‌షిప్‌‌‌‌లో భాగంగా రాబోయే నెలల్లో బ్రుకిన్సాను భారత్‌‌‌‌లోకి  తీసుకొస్తాం. 

ఈ లాంచ్ మా ఇన్నోవేటివ్ ఆంకాలజీ పోర్ట్‌‌‌‌ఫోలియోలో పెద్ద మైలురాయి. భారత్‌‌‌‌లోని పేషెంట్స్‌‌‌‌కు గ్లోబల్‌‌‌‌గా నమ్మదగ్గ, నిరూపితమైన, సమర్ధవంతమైన, సేఫ్టీ ఉన్న  థెరపీని  అందుబాటులోకి తెస్తాం” అని గ్లెన్‌‌‌‌మార్క్ ప్రెసిడెంట్ అలోక్ మాలిక్ చెప్పారు.  కంపెనీ షేర్లు  సోమవారం  0.68 శాతం పెరిగి రూ.1,601 వద్ద ముగిశాయి.