న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం జరిగే గ్లోబల్ సూర్య నమస్కార్ ప్రోగ్రాంకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఆయుష్ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో వర్చువల్గా మాట్లాడారు. ‘‘ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న జరిగే సూర్యనమస్కార కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. మేము 75 లక్షల మంది పాల్గొనేలా టార్గెట్ పెట్టుకున్నం. కానీ, ఆన్లైన్లో ఎన్ రోల్మెంట్లు చూస్తుంటే కోటి మందికి పైగా పాల్గొంటారని తెలుస్తోంది” అని సోనోవాల్ చెప్పారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని సైంటిఫిక్గా రుజువైందన్నారు.