రూ. 30లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారి మండప అలంకరణ

రూ. 30లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారి మండప అలంకరణ

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భిన్నరూపాల్లో అలంకరించిన ఆదిపరాశక్తి మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లాలో దుర్గమల్లేశ్వరి ఆలయ మండపాన్నికరెన్సీ నోట్లతో అలంకరించారు. ఐదు వందలు, వందనోట్లతో సహా యాభై, 20 రూపాయల నోట్లను వినియోగించారు.

కరెన్సీ నోట్లతో అలంకరణకు సుమారు 30లక్షల వరకు వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. నోట్ల మండపాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.