మెహిదీపట్నం,వెలుగు: బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం ఐదో పూజ ఘనంగా జరిగింది. పాతబస్తీలోని పలు ఏరియాల నుంచి గోల్కొండ కోటకు డప్పు వాయిద్యాలతో పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో భారీగా తొట్టెల ఊరేగింపులు కొనసాగాయి.
ఉదయం నుంచి రాత్రి వరకు కోటలోని జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ALSO READ :వరంగల్ ప్రేమ వ్యవహారంలో.. ఇండ్లకు నిప్పు పెట్టిన 11 మంది అరెస్టు