మిడ్జిల్ మండలంలో15 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు

మిడ్జిల్ మండలంలో15 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు

మిడ్జిల్, వెలుగు: ఇంట్లో చొరబడిన దుండగులు బంగారం, నగదు ఎత్తుకెళ్లిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మిడ్జిల్ కు చెందిన సంబ అంజమ్మ శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లింది. బయటకు వెళ్లిన ఆమె కొడుకు నాగరాజు మధ్యాహ్నం ఇంటికి రాగా తాళం పగులగొట్టి ఉంది. 

లోపలికి వెళ్లి బీరువాలో చూడగా 15 తులాల బంగారం, రూ.15 వేలు కనిపించలేదు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని, తల్లితో కలిసి పోలీస్​స్టేషన్​కు వెళ్లాడు. అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగేశ్వర్ పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రమణారెడ్డి పరిశీలించారు.