Gold Rate: తులం రూ.3వేల 800 పెరిగిన గోల్డ్.. ఇలా అయితే హైదరాబాదీలు కొనటం కష్టమే..!!

Gold Rate: తులం రూ.3వేల 800 పెరిగిన గోల్డ్.. ఇలా అయితే హైదరాబాదీలు కొనటం కష్టమే..!!

Gold Price Today: గతవారం చివరిలో తిరిగి పుంజుకున్న పసిడి ధరలు ఈవారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఆందోళనలు లేనప్పటికీ గోల్డ్ స్వల్పంగా పెరుగుదలను నమోదు చేయటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో శుభకార్యాలకు షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా పెరిగిన ధరలను పరిశీలించటం ఉత్తమం. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 755, ముంబైలో రూ.8వేల 755, దిల్లీలో రూ.8వేల 770, కలకత్తాలో రూ.8వేల 755, బెంగళూరులో రూ.8వేల 755, కేరళలో రూ.8వేల 755, పూణేలో రూ.8వేల 755, వడోదరలో రూ.8వేల 760, జైపూరులో రూ.8వేల 770, లక్నోలో రూ.8వేల 770, నాశిక్ లో రూ.8వేల 758, అయోధ్యలో రూ.8వేల 770, బళ్లారిలో రూ.8వేల 755, నోయిడాలో రూ.8వేల 770, గురుగ్రాములో రూ.8వేల 770 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3వేల 800 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 551, ముంబైలో రూ.9వేల 551, దిల్లీలో రూ.9వేల 566, కలకత్తాలో రూ.9వేల 551, బెంగళూరులో రూ.9వేల 551, కేరళలో రూ.9వేల 551, పూణేలో రూ.9వేల 551, వడోదరలో రూ.9వేల 556, జైపూరులో రూ.9వేల 566, లక్నోలో రూ.9వేల 566, నాశిక్ లో రూ.9వేల 554, అయోధ్యలో రూ.9వేల 566, బళ్లారిలో రూ.9వేల 551, నోయిడాలో రూ.9వేల 566, గురుగ్రాములో రూ.9వేల 566గా ఉన్నాయి.

►ALSO READ | హైదరాబాద్‌‌‌‌ మార్కెట్‌‌లోకి కొత్త స్కోడా కోడియాక్‌‌‌‌

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 755 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు రూ.9వేల 551గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 9వేల వద్ద ఉంది.