2025 - 26 ఆర్థిక సంవత్సరంలో బంగారు నగల సేల్స్‌‌‌‌‌‌‌‌ 10 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌: ఇక్రా

2025 - 26 ఆర్థిక సంవత్సరంలో బంగారు నగల సేల్స్‌‌‌‌‌‌‌‌ 10 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌: ఇక్రా
  • గోల్డ్ కాయిన్స్‌‌‌‌‌‌‌‌, బార్స్‌‌‌‌‌‌‌‌కు పెరగనున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌: ఇక్రా

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో బంగారు నగల అమ్మకాలు 9-–10 శాతం తగ్గే చాన్స్ ఉందని ఇక్రా ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  గోల్డ్ ధరలు  33 శాతం పెరగడమే కారణమని వెల్లడించింది.   గ్లోబల్ ఎకనామిక్ అనిశ్చితి, జియోపొలిటికల్, ట్రేడ్ టెన్షన్స్ మధ్య ఇన్వెస్టర్లు  గోల్డ్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. 

ఈ ట్రెండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని ఇక్రా అంచనా వేస్తోంది. గోల్డ్‌‌‌‌‌‌‌‌ బార్స్, కాయిన్స్ డిమాండ్ సుమారు 10 శాతం పెరుగుతుందని, మొత్తం గోల్డ్ డిమాండ్‌‌‌‌‌‌‌‌లో వీటి వాటా 35 శాతం ఉంటుందని తెలిపింది.  అయితే, వాల్యూమ్స్ తగ్గినా, గోల్డ్ జ్యూయలరీ అమ్మకాల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  12–-14 శాతం పెరుగుతుందని అంచనా.