
- గురువారం 10 గ్రాముల ధర రూ.850 పైకి
- ఢిల్లీలో రూ.99,340 ని టచ్ చేసిన గోల్డ్ రేటు
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఢిల్లీలో గురువారం రూ.850 పెరిగి 10 గ్రాములకు రూ.99,340కి చేరాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఓవర్సీస్ మార్కెట్లో బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం. 22 క్యారెట్ల బంగారం ధర రూ.800 పెరిగి 10 గ్రాములకు రూ.98,800 (అన్ని టాక్స్లతో సహా) కి చేరింది.
మరోవైపు వెండి ధరలు రూ.100 తగ్గి కిలోగ్రామ్కు రూ.1,07,000 పలుకుతోంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర గురువారం 10 గ్రాములకు రూ.880 పెరిగి రూ.99,280 కి చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్ట్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ రూ.1,585 పెరిగి 10 గ్రాములకు రూ.98,289 వద్ద ట్రేడవుతున్నాయి. అక్టోబర్ డెలివరీ కాంట్రాక్ట్స్ రూ.1,520 పెరిగి 10 గ్రాములకు రూ.99,214 ను తాకాయి.
ధరలు పెరగడానికి గల కారణాలు...
“యూఎస్, -ఇరాన్ మధ్య టెన్షన్స్ పెరగడం వల్ల పెట్టుబడులకు సేఫ్ అయిన గోల్డ్కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే, యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే బలహీనంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించదనే అంచనాలు ఎక్కువయ్యాయి. దీంతో గురువారం బంగారం ధరలు పెరిగాయి” అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ అన్నారు. కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ కైనత్ చైన్వాలా మాట్లాడుతూ, “యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల్లో టారిఫ్స్ ప్రకటన చేస్తామని ప్రకటించడంతో గోల్డ్కు డిమాండ్ మళ్లీ పెరిగింది” అని వివరించారు.
“మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు యూఎస్ ఎకనామిక్ డేటా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ), వీక్లీ ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా గురువారం రిలీజ్ అవుతాయి. ఇవి బంగారం కదలికలను ప్రభావితం చేయొచ్చు” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర గురువారం 0.47 శాతం పెరిగి ఔన్స్ (28 గ్రాముల)కు 3,370.87 డాలర్లకు చేరుకుంది. స్పాట్ సిల్వర్ రేటు 0.54 శాతం తగ్గి ఔన్స్కు 36.05 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.